ఏపీలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసు గురించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి దివ్య హత్య కేసుతో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల విచారణలో 2018లో వీరబాబు అనే వ్యక్తితో దివ్యకు పెళ్లి జరిగినట్లు తేలింది. దివ్యతో పెళ్లి తర్వాత మూడు నెలల పాటు కాపురం చేసిన వీరబాబు తరచూ దివ్యను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు. 
 
వీరబాబుకు దివ్య పిన్ని కాంతవేణి కూడా దివ్యను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేయసాగింది. వీరి ఒత్తిడి తట్టుకోలేక దివ్య విశాఖకు చేరుకుని తనకు తెలిసిన గీత అనే యువతి వద్దకు వచ్చినట్టు చెప్పారు. హత్య సమయంలో నిందితులు దివ్య వద్ద సెల్‌ఫోన్‌ లేకుండా చేశారని పోలీసులు తెలిపారు. దివ్యను అతి క్రూరంగా హింసించి హత్య చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: