పూణే పోలీసుల్లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇప్పటివరకు పూణే సిటీ పోలీసులలో 62 కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. వాటిలో 23 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు వెంట‌నే అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతున్నారని పోలీసు కమిషనర్ తెలిపారు. ఇప్పటివరకు కొవిడ్ -19 బారిన‌ప‌డి ఇద్ద‌రు పోలీసులు మృతి చెందారు.

 

ప్రస్తుతం 100 మంది పోలీసులు, 96 మంది సిబ్బంది, నలుగురు అధికారులు నిర్బంధంలో ఉన్నారు.  ఇదిలా ఉండ‌గా.. మ‌హారాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు  వద్ద ఇద్దరు సిబ్బందిని కోల్పోయారు. మంగళవారం వరకు 3177మంది పోలీసులు వైర‌స్‌బారిన‌ప‌డ్డారు. వీరిలో 1,655 కేసులు ఇప్పటివరకు కోలుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: