ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను ఉద్దేశించి 95వ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగించారు. ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని.... సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లటమే మన కర్తవ్యం అని చెప్పారు. సమస్యలకు భయపడితే ముందుకు వెళ్లలేమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ ను నిర్ణయించేది మన శక్తిసామర్థ్యాలే అని అన్నారు. 
 
ఇలాంటి పరీక్షల సమయంలో మనం ధైర్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. విజయం సాధించే వరకు ఎక్కడా మనోధైర్యం కోల్పోకూడదని... భారత్ పురోగతిలో ఐసీసీ పాత్ర గొప్పదని చెప్పారు. భారత్ ప్రకృతి వైపరిత్యాలతో పోరాడుతోందని.... విజయం సాధించే వరకు వెనుకడుగు వేయకూడదని అన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో పరస్పర సహకారం ముఖ్యమని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: