టాలీవుడ్ లో లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు, నిశ్చితార్థ వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సన్నిహితుల సమక్షంలో హీరోలు, దర్శకులు వివాహం, నిశ్చితార్థం, రోకా వంటి కార్యక్రమాలను చేసుకుంటున్నారు. తాజాగా సాహో దర్శకుడు సుజీత్ రెడ్డి నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రవళ్లిక అనే డెంటిస్ట్‌ వేలికి ఉంగరం తొడిగి సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుక చేసుకున్నారు. 
 
అత్యంత సన్నిహితులు మాత్రమే నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో సుజీత్ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లఘు చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ రన్ రాజా రన్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతో సక్సెస్ అందుకున్న సుజీత్ రెండో సినిమా ప్రభాస్ తో తెరకెక్కించగా ఆ సినిమా ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంది. ఇక ఈ దర్శకుడు ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. లూసిఫర్ రీమేక్‌కి సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: