మే నెల 7వ తేదీన విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. టీడీపీ ప్రకటించిన ఆర్థిక సాయాన్ని నేడు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చంద్రబాబు పార్టీ బాధ్యులను ఆదేశించారు. మృతులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. 
 
ఈరోజు నగదు జమ అనంతరం స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా టీడీపీ జిల్లా నాయకులు మృతుల కుటుంబాలను కలిసి ఆర్థిక సహాయంపై చంద్రబాబు లేఖను వారికి అందజేయనున్నారు. గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు. చంద్రబాబు మృతుల కుటుంబాలకు, అస్వస్థత పాలైన కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని తెలియజేయాలని విశాఖ పార్టీ నేతలకు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: