పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘాటు విమర్శలు చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎస్సెమ్మెస్ ద్వారా ఆయన తన సందేశాన్ని పంపించారు. ప్రసాదరాజు తనపై విమర్శలు చేసినందు వల్ల ఆయనకు త్వరలో మంత్రి పదవి వస్తుందంటూ జోస్యం చెప్పారు. ఆయనతో ఇలా ఎవరు మాట్లాడించారో తనకు తెలుసని అన్నారు. 
 
తాను సీటు అడిగానో లేక బతిమాలితే వచ్చానో ఆయనకు బాగా తెలుసంటూ విమర్శలు చేశారు. నాకు పార్లమెంట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరు ఇచ్చారో కూడా ఆయనకు బాగా తెలుసని అన్నారు. అందరిలాగా ప్రజల మీదపడి డబ్బులు కలెక్ట్ చేయడం నా పద్ధతి కాదని అన్నారు. అటువంటి సొమ్ముతో ఫోటోలు దిగడానికి తాను వెళ్లలేదని చెప్పారు. జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడదామని ప్రయత్నించానని కానీ సీఎం తనకు టైం ఇవ్వలేదని అన్నారు. ఏదేమైనా ప్రసాదరాజుకి మంత్రి పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ సందేశంలో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: