వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఉన్నతశ్రేణి నాయకత్వంపై రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నేతలు కాళ్లావేళ్లా పడి బతిమాలితేనే పార్టీలో చేరానని అన్నారు. వైసీపీ పార్టీలో విచిత్రమైన పరిస్థితి ఉందని చెప్పారు. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటే ఆ కులం వాళ్లతోనే తిట్టిస్తారని అన్నారు. నన్ను విమర్శించిన మిత్రుడు ప్రసాదరాజుకు మంత్రి పదవి రావొచ్చంటూ మరోమారు వ్యాఖ్యానించారు. 
 
సీఎం జగన్ కు పార్టీలో జరుగుతున్న విషయాలు తెలియకపోవచ్చని... సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన టైం ఇవ్వలేదని చెప్పారు. ప్రజలపై పడి డబ్బులు వసూలు చేసి చెక్కులిచ్చేందుకు తాను వ్యతిరేకమని అన్నారు. పార్టీ నేతలు ఇళ్ల స్థలాల భూసేకరణ, పట్టాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మా పార్టీలో పదవులన్నీ ఏ వర్గం వారికి దక్కాయో బహిరంగ రహస్యమేనని అధికార పార్టీపై విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: