కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ లారీ ఒకదానినొకటి ఢీ కొనడంతో ఘటనాస్థలంలోనే ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు ఖమ్మం జిల్లా గోపవరంకు చెందిన వారని సమాచారం. 
 
ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది ఉన్నారని సమాచారం. వీరు వేదాద్రి లక్ష్మీ నరసింహా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆలయం సమీపంలోనే పమాదం చోటు చేసుకుంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: