నేను రాననుకున్నారా.. రాలేనుకున్నారా.. ఏదైనా నేను వచ్చేంత వరకు నేను సీన్లోకి దిగానంటే దబిడి దిబిడే... ఇలాంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ కొట్టడంలో బాలయ్య తర్వాతే అని అంటారు.  నేడు ఏపీలో రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓటు వేయడానికి టీడీపీ తరపున మొదట ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ కుక్క మొరిగింది. అంతే నందమూరి బాలయ్యలో నటుడు బయటకు వచ్చారు.. సమయోచితంగా స్పందిస్తూ... ఎవరికి అర్థమయ్యే భాషలో వారికి చెప్పాలని అన్నారు.

 

తాము అరిచేవాళ్లం కాదని... కరిచేవాళ్లమని అన్నారు. ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకుని బాలయ్య ఇలా వ్యంగ్యంగా అన్నట్టు భావిస్తున్నారు. అయితే ఈ డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ.. పంచ్ డైలాగ్స్ తర్వాత నీవే బాలయ్య అని అంటున్నారు నెటిజన్లు. కాగా, ఇప్పటి వరకు 167 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.

 

టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు అరెస్ట్ కారణంగా, అనగాని అనారోగ్యం కారణంగా ఓటు వేయడానికి రాలేదు. టీడీపీ రెబెల్స్ వల్లభనేని వంశీ, మద్దాలి గిరి ఓటు వేశారు. మరో సభ్యుడు కరణం బలరాం ఓటు వేయాల్సి ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. జరిగిన ఎన్నికల విషయంలో ఎవరి గెలుపు ధీమా వారికే ఉందని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: