ఏపీలో కరోనాకు ఇప్పట్లో బ్రేకులు పడే పరిస్థితులు లేవు. అధికారికంగానే రోజు రోజుకు కొత్త కరోనా కేసులు పుట్టుకు వస్తున్నాయి. ఇక అనధికారికంగా చాలా కేసులే ఉన్నాయని టాక్. ఈ అనధికారిక కేసులను గుర్తించడంలో ఆలస్యం జరుగుతుండడంతో వీరి వల్ల మరిన్ని కొత్త కేసులు పుట్టుకు వచ్చేస్తున్నాయి. ఇక ఏపీలో ప్రస్తుతం ఉన్న కరోనా కేసులు చూస్తే గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 465 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి.
కొత్తగా 376 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,961కు చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నాలుగు మరణాలు సంభవించాయి. అందులో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 96కి చేరింది.