ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు నిర్వహించనుంది. అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రాథమికంగా షెడ్యూల్ ను రూపొందించి తుది అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఈ తేదీలలో గ్రామ, వార్డ్ సచివాలయల పరీక్షలు జరుగుతాయి.
గ్రామ, వార్డ్ సచివాలయాలలోని 16,208 ఉద్యోగాలకు 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వీలైనంత త్వరగా ఈ పరీక్షలను నిర్వహించాలని.... ఒక్కో గదిలో 16 లేదా 24 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆగష్టు నెలలో పరీక్షలు జరిగే అవకాశం ఉందని దరఖాస్తుదారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
VS/WS Exams phase 2 in ap may be scheduled to be held in 2nd week of august 2020. Detailed date sheet is being worked out and will be announced soon. All applicants are requested to be prepared accordingly.
— Gopal krishna Dwivedi (@gkd600) June 19, 2020