ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో ఫాల్గుణి నక్షత్రం రోజున శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ నుంచి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. 
 
25, 26, 27వ తేదీల్లో ఉదయం 9.00 నుంచి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.00 గంట‌లకు ఆల‌య ముఖ మండ‌పంలో స్వామివారిని మొదటిరోజు పెద్ద‌శేష వాహ‌నంపై, రెండో రోజు హనుమంత వాహనంపై, మూడో రోజు గరుడ వాహనంపై వేంచేపు . జరుపుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: