గత కొన్ని రోజలుగా  తెలంగాణలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ భూతం కట్టలు తెంచుకుని విజృంభిస్తోంది. తాజాగా 3,227 శాంపిల్స్ పరీక్ష చేయగా 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 816 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వాళ్లే. రంగారెడ్డి జిల్లాలో 47, మంచిర్యాల్ జిల్లాలో 33, మేడ్చెల్ జిల్లాలో 29 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇటీవల లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకున్నవారి సంఖ్య పెరిగిపోయింది.  అప్పటి నుంచి కేసులు సంఖ్య కూడా పెరిగిపోతూ వస్తుంది. తాాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది.

 

కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కలెక్టరేట్ సిబ్బందిలో ఆందోళన నెలకొంది. ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి పెరిగింది. ప్రస్తుతం 9 వేల మంది చికిత్స పొందుతుండగా, 5,172 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 244 మందిని డిశ్చార్జి చేశారు. ఇక, తెలంగాణలో తాజాగా 4 మరణాలు సంభవించాయి. దాంతో కరోనా మృతుల సంఖ్య 247కి పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: