మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన రోజు నుంచి మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 5,257 కేసులు నమోదయ్యాయి. 181 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. ఒక్కరోజే నమోదైన కేసులతో 1,69,883 కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులలో ప్రస్తుతం 73,298 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన కేసులలో మూడింట ఒక వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. రోజురోజుకు వైరస్ విజృంభిస్తూ ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
Maharashtra reports 181 deaths and 5257 new #COVID19 positive cases today. Out of 181 deaths, 78 occurred in the last 48 hours and 103 from the previous period. The total number of cases in the state reaches 169883 including 73298 active cases: State health Department pic.twitter.com/M4EtqjLKOg
— ANI (@ANI) June 29, 2020