ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలైన చైనా, భారతదేశం మధ్య టిబెట్ ఎల్లప్పుడూ బఫర్ జోన్గా పనిచేస్తుంది. భారత చైనా మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో... టిబెట్ సమస్య గురించి మాట్లాడాలని ప్రవాస టిబెటన్ ప్రభుత్వ నాయకుడు లోబ్సాంగ్ సంగే కోరారు. భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలకు టిబెట్ కూడా ఓ కారణమని... అందుకే టిబెట్ను ప్రధాన సమస్యల్లో ఒకటిగా భావించాలని సంగే పేర్కొన్నారు.
తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ వద్ద భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీనిని పరిష్కరించేందుకు ఇరుదేశాలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చల్లో టిబెట్ సమస్యను భారత్ లేవనెత్తాలని సంగే కోరుతున్నారు. ధర్మశాల టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాతో పాటు సిటిఎకు నివాసంగా ఉంది, దీనిని తరచుగా టిబెటన్ ప్రభుత్వం-బహిష్కరణ అని పిలుస్తారు.