ఉచిత రేషన్ ని నవంబర్  చివరి వరకు తమ ప్రభుత్వం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. వన్ రేషన్ వన్ నేషన్ కార్యక్రమాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. దేశం దీపావళి వరకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కొనసాగుతుందని మోడీ అన్నారు. 

 

ఉచిత రేషన్  ప్రతీ పేదవాడికి అందిస్తామని ఆయన ఈ సందర్భంగా వివరించారు.  వన్ రేషన్ వన్ నేషన్ పథకం పేదలకు వలస కార్మికులకు లబ్ది చేకూరుస్తుంది అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వర్షా కాలంలో పేదలు ఎవరూ కూడా పస్తులు ఉండవద్దు అని అన్నారు. ఉచిత రేషన్ కు 90 వేల కోట్లు ఖర్చు అవుతుంది అని అయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: