సాధారణంగా కిడ్నాపింక్ కేసులు ఎలా ఉంటాయి.  కేసు నమోదు చేసినప్పటి నుంచి ఎక్కడ ఎలా కిడ్నాప్ అయ్యారు.. సీసీ ఫుటేజ్ లు, ఎంక్వేయిరీలు.. ఫోన్ కాల్స్ పర్యవేక్షించడం ఎన్నో తతంగాలు ఉంటాయి. కొన్ని కిడ్నాప్ కేసులు నెలలు పట్టిన పట్టొచ్చు. కొన్ని కేసులు అతి తక్కువ సమయంలో పరిష్కరించవొచ్చు. తాజాగా కిడ్నాప్ అయిన పాపను  5 గంటల వ్యవధిలో తల్లిదండ్రుల వద్దకు చేర్చారు కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు. అంబర్ పేట గ్రామానికి చెందిన అక్షర అనే ఆరేళ్ల తమ పాప మంగళవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాప ఎక్కడ తిరిగిన విషయం పై దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన చందు అనే వ్యక్తి పాపను అపహరించినట్లు గుర్తించారు. చందు, పాప తండ్రి స్నేహితులు. గత సాయంత్రం చందు, పాప తండ్రికి ఫుల్లుగా మద్యం తాగించాడు. అతను నిద్రలోకి జారుకున్న వెంటనే పాపను తీసుకుని పరారయ్యాడు. అనుమానం వచ్చిన చందుపై నిఘా పెట్టారు. అతని సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: