సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేడు మీడియాతో మాట్లాడుతూ స్వాదాద్రి రియల్ ఎస్టేట్ స్కాంలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ రఘు మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసి ప్రజలను మోసం చేశాడని చెప్పారు. ఏడాదిలో ఫ్లాట్ వస్తుందని చెబితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. వడ్డీ పేరుతో నమ్మించి ప్రజలను మోసం చేశారని చెప్పారు. 156 కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు చెప్పారు. 
 
రఘు, శ్రీనివాస్, మీనాక్షిలను పోలీసులు అరెస్ట్ చేశామని... ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేశారని చెప్పారు. ప్రాథమికంగా ముగ్గురిని గుర్తించామని..... మిగిలిన వారిని గుర్తించాల్సి ఉందని చెప్పారు. వచ్చే ఆదాయం ఎక్కువ ఉండి ఇచ్చే ఆదాయం తక్కువ ఉంటే దుకాణం మూసివేస్తారని అన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: