ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది . ఇక ఈ ఘటనలో ఏకంగా ఒకరు మృతి చెందడం  సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్డు పై వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

 

 ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ అవడంతో వాహనం బోల్తా పడింది. ఇక ఈ ప్రమాదంలో హెడ్కానిస్టేబుల్ తీవ్ర గాయాలై మృతి చెందగా మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: