దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా భారీన పడుతున్నారు. ఒడిశా రాష్ట్రం కరోనా ధాటికి గజగజా వణుకుతోంది. తాజాగా ఆ రాష్ట్రానికి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సుకాంత కుమార్ నాయక్ కు సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
తాజాగ కటక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బెహరా కరోనా భారీన పడ్డారు. ఆశ్విని కోవిడ్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఒడిశాలో ఇప్పటి వరకు 10,097 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ప్రస్తుతం 3,340 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6,703 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 54 మంది మృతి చెందారు.
BJD mla becomes second legislator in odisha to test positive for COVID-19 https://t.co/SubdWuir98
— Republic (@republic) July 8, 2020