కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఆరో విడత నిధులను జమ చేయనుంది. మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. 10 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి సంవత్సరం కేంద్రం 2,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో 6,000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తోంది. 
 
ఆగష్టు 1వ తేదీన రైతుల ఖాతాలలో ఆరో విడత నగదు జమ కానుంది. ఈ పథకంలో చేరని వారు ఉంటే పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారంను పీఎం కిసాన్ వెబ్ సైట్ లో పొందుపరిచి ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. కేంద్రం అందించిన నగదు రైతులకు పెట్టుబడి సాయం రూపంలో ఉపయోగపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: