తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో విలన్ గా నటించిన పొన్నంబళమ్ గుర్తుంది కదా.. ప్రస్తుతం ఆయన కిడ్నీ సంబంధింత సమస్యలతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా షూటింగ్స్ లేవు.. దాంతో ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా ఇబ్బందులు పడుతున్న విషయం విశ్వనటుడు కమల్ హాసన్ చెవిన పడింది. వెంటనే స్పందించిన కమల్ హాసన్ కొంత డబ్బు సాయం చేస్తానని మాట ఇచ్చారట. అంతేకాదు ఆయన పిల్లల చదువు ఖర్చులని కూడా తానే భరిస్తానని అన్నారట.
పొన్నాంబలం తెలుగు, తమిళ స్టార్ హీరోలకు విలన్ గా నటించిన విషయం తెలిసిందే. రజినీ నటించిన 'ముత్తు', 'అరుణాచలం', అజిత్ నటించిన 'అమర్కలమ్', విక్రమ్ 'సామి', కమల్ హాసన్తో కలిసి 'అపూర్వ సాగోధరార్గల్', 'మైకేల్ మదన కామరాజన్' వంటి చిత్రాల్లో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో కూడా పొన్నాంబం నటించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఓ వీడియో ద్వారా వివరించిన పొన్నంబళమ్ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. బిగ్ బాస్ రెండో సీజన్లోను పాల్గొన్న ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.