ఆంధ్రప్రదేశ్ లో ఇక ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కరోనా పరీక్షలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఉద్యోగుల కాంటాక్ట్స్ మాత్రమే కాదు వారిలో అందరికి పరీక్షలను నిర్వహించాలి అని భావిస్తున్నారు. కరోనా కేసులు వారిలో వస్తే  ఎక్కువగా ఇతర ఉద్యోగులకు  కూడా వచ్చే అవకాశం ఉంది.

 

అదే విధంగా  వారితో లింక్ అయి ఉన్న ప్రజలకు కూడా కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు కరోనా పరీక్షలను ఉద్యోగులంద‌రికి చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సచివాలయం అసెంబ్లీ లో కరోనా పరీక్షలను ఉద్యోగులు అందరికి చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే కేబినేట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: