తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత కొన్ని రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ వెయ్యికి పైగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1178 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 33,402కు చేరింది. ఒక్కరోజే 9 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 348కి చేరింది. రాష్ట్రంలో 20,919 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 12,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: