ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా.. అటు గల్ఫ్ను కూడా గడగడలాడిస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యూఏఈలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక ఖతార్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ఇక శనివారం కూడా కొత్త కేసులు 498 నమోదు అయ్యాయి. దీంతో ఖతార్లో కేసులు లక్ష దాటేశాయి.
ఈ కొత్త కేసులతో ఇప్పటివరకు ఆ దేశంలో కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 1,03,128కు చేరగా... మొత్తం కోలుకున్న వారు 98,934 మంది అయ్యారు. దీంతో గల్ఫ్లో సౌదీ తర్వాత ఖతార్లోనే అత్యాధిక కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ రెండు దేశాల్లోనే 489,000 కరోనా పాజిటివ్ కేసులు, 3వేల మరణాలు నమోదయ్యాయి.