ఏపీలో విప‌క్ష టీడీపీకి చెందిన ఓ కీల‌క నేత మృతి చెందారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, తోట్ల వల్లూరు మాజీ సర్పంచ్ శ్రీ బండి శ్రీమన్నారాయణ ఈ రోజు మృతి ,చెందారు. తోట్ల‌వ‌ల్లూరు మాజీ స‌ర్పంచ్‌గా ప‌నిచేసిన ఆయ‌న గ‌తంలో పాత ఉయ్యూరు నియోజ‌క‌వ‌ర్గంతో పాటు పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ రాజ‌కీయాల్లో ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. రాజ‌కీయాల్లో అజాత శ‌త్రువుగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు.

 

ఇక ఆయ‌న మృతి సంద‌ర్భంగా కృష్ణా జిల్లా టీడీపీకి చెందిన ప‌లువురు నేత‌లు త‌మ సంతాపం వ్య‌క్తం చేశారు. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సైతం ట్విట్ట‌ర్‌లో త‌న సంతాపం వ్య‌క్తం చేశారు. శ్రీ బండి శ్రీమన్నారాయణ గారి మరణం విచారకరం. పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని లోకేష్ త‌న సంతాపం సందేశంలో పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: