ఏపీలో రోజు రోజుకు కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం కరోనా కేసులు, మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. తాజా అప్డేట్ ప్రకారం ఏపీలో గత 24 గంటల్లో ఏకంగా 1953 కేసులు నమోదు అయ్యాయి. అలాగే గత 24 గంటల్లో 37 మరణాలు నమోదు అయ్యాయి. ఇక ఇప్పటి వరకు చూస్తే మొత్తం కరోనా కేసులు 31301 కేసులు నమోదు అయ్యాయి.
అలాగే మొత్తం కరోనా మరణాలు 365 కేసులు నమోదు అయ్యాయి. ఇక 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదు అయ్యాయి. దీనిని బట్టి చూస్తుంటే ఏపీలో రోజు రోజుకు కరోనా ఎంతలా విజృంభిస్తుందో అర్థమవుతోంది. మరి ఇకపై అయినా ప్రభుత్వం, అటు ప్రజలు కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.