క‌రోనా వైర‌స్ రోజురోజుకు దేశంలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఈ వైర‌స్ ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. కొద్ది రోజులుగా క‌రోనా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల‌తో పాటు ఎమ్మెల్యేల కుటుంబ స‌భ్యుల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. ఏపీ, తెలంగాణ‌, క‌ర్నాక‌ట‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, బెంగాల్లోని ప‌లువురు ఎమ్మెల్యేలు క‌రోనా భారీన ప‌డ్డారు. తాజాగా క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో మ‌రో ఎమ్మెల్యే క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వ‌చ్చింది. క‌ర్నాట‌క‌లోని అర్సికెరి ఎమ్మెల్యే శివలింగగౌడ భార్యకు కరోనా వైరస్ సోకింది. 

 

మంగళవారం జరిపిన పరీక్షల్లో ఎమ్మెల్యే భార్యకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు రావడంతో ఎమ్మెల్యేతోపాటు అతని సిబ్బంది హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. తన భార్యకు కరోనా సోకడంతో ఆమెను హాసన్ పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించామని... తన భార్యకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండానే క‌రోనా వ‌చ్చింద‌ని... తాను హోంక్వారంటైన్ లో ఉన్నందున వారం రోజుల పాటు తనను కలిసేందుకు ఇంటికి రావద్దని, ఏవైనా సమస్యలుంటే తనకు ఫోన్ లో చెప్పాలని ఎమ్మెల్యే శివలింగ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: