ఈ మద్య చాలా మంది మనుషులు చిన్న చిన్న విషయాలకు మనసు పాడు చేసుకొని క్షణికావేశంలో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మనుషులపై దాడులు చేయడం.. ఆత్మహత్యలుచేసుకోవడం.. ఇలా ఎన్నో అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. తాజాగా  ఓ వ్యక్తి తనకు పెట్రోల్ పోయలేదని ఏకంగా ఆ ఆఫీస్ లో పాములను వదిలి భయబ్రాంతులకు గురి చేశాడు. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది.  ఆ వ్యక్తి సిబ్బంది పై ఎంతగా పగ పెంచుకున్నాడంటే.. వరుసగా పాములను తీసుకు వచ్చి బంక్ లో వదలడం వారంతా కంగారుతో పరుగులు తీయడం అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

 

బుల్దానా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బాటిల్ తీసుకువచ్చి పెట్రోల్ పోయమని సిబ్బందిని కోరాడు. కానీ నిబంధనల ప్రకారం తాము బాటిల్‌లో పోసేది లేదని, వెళ్లి బైక్ తీసుకురావాలని చెప్పారు. తనకు పెట్రోల్ పోయకుండా అవమానించిన వీరిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని మనసులో పెట్టుకున్నాడు ఆ యువకుడు.  వెంటనే అది అటూ ఇటూ పాకుతూ టేబుల్ కింద దూరింది. ఆ తర్వాత మరో పాము తీసుకువచ్చేందుకు వెళ్లాడు. ఆ సమయంలో మహిళ ఒక్కతే ఉండటంతో ఆమె బయటకు పరుగులు తీసింది. దీనిపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: