దేశంలో స్టేట్
బ్యాంక్ ఆఫ్
ఇండియా (ఎస్బీఐ),
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇక దేశంలోని టాప్ 2 బ్యాంకులు ఈ రెండు బ్యాంక్లు. దేశీ అతిపెద్ద బ్యాంక్గా ఎస్బీఐ కొనసాగుతూ ఉంటే.. ప్రైవేట్ రంగంలో టాప్ బ్యాంక్గా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముందుకు కొనసాగుతుంది.
ఇక దేశంలో చాలా మంది ఈ బ్యాంకుల్లో అకౌంట్ తెరవాలని అనుకుంటున్నారు. ఐతే వీరికి ఒక పెద్ద శుభవార్త. ఈ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి బ్యాలెన్స్ లేకుండానే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అయితే జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై కొన్ని పరిమితులు ఉంటాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకుల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ల బెనిఫిట్స్, ఫీచర్లు చాల బ్యాంక్ల తేడాలు ఉన్నాయి.
ఇప్పుడు అవేంటో చూద్దామా మరి... మొదటగా ఎస్బీఐ భారతీయ పౌరులందరూ ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ తెరవొచ్చు. ఒకరు లేదా ఇద్దరు కలిసి అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. రెగ్యులర్ ఎస్బీఐ సేవింగ్స్
బ్యాంక్ అకౌంట్ వడ్డీ రేటే ఈ ఖాతాలకు కూడా వర్తించడం జరుగుతుంది. జీరో బ్యాలెన్స్ అకౌంట్లో డిపాజిట్లకు ఎలాంటి నియంత్రణ లేదు అని అధికారులు తెలుపుతున్నారు.
ఇక కస్టమర్లు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేసుకున్నా కూడా ఏటువంటి చార్జీలు ఉండవు. ఖాతాదారులకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి మెయింటెనెన్స్ చార్జీలు కూడా ఉండవు. నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలు ఉచితం. నెలకు ఏటీఎం నుంచి 4 సార్లు డబ్బులు విత్డ్రా కూడా చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పుడు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో గతంలో ఎన్నడూ ఎలాంటి అనుబంధం లేని వారు జీరో బ్యాలెన్స్ అకౌంట్ను తెరవొచ్చు.
బ్యాంక్ అకౌంట్లో నెలకు రూ.50,000 మించి డబ్బులను ఉంచుకోకూడదు. అలాగే నెలకు రూ.10,000 వరకు మాత్రమే డబ్బులను విత్డ్రా లేదా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో అకౌంట్ క్రెడిట్స్ విలువ రూ.లక్ష మించి దాటకూడదు అని తెలుపుతున్నారు అధికారులు. ఇక
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ కలిగి వారికి పాస్బుక్ ఉచితంగానే ఇస్తారు. క్యాష్ డిపాజిట్,
చెక్ బుక్ డిపాజిట్ సేవలు కూడా ఉచితంగానే ఇస్తారు బ్యాంకు వాళ్లు. రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు అందజేస్తారు. నెలకు 4 సార్లు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది.