టెక్ రంగంలో దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ పై మరోసారి ఆరోపణలు రావడం జరిగింది. సెప్టెంబర్ 20వ తేదీన బోర్డుకు ఓ లేఖ అందగా, అది భారత కార్పొరేట్ ప్రపంచాన్ని కలిచి వేసింది. సంస్థలో అనైతిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అని, ఆదాయాన్ని కూడా  ఎక్కువగా చేసి లెక్కలు చూపిస్తున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే కదా. దీనిపై ఇన్ఫోసిస్లో అంతర్గత విచారణ కూడా జరుగుతూ ఉండగా, సెబీ సైతం విచారణ మొదలు పెట్టడం జరిగింది.


ఇటీవల  పేరును వెల్లడించకుండా మరో విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేయడంతో పాటు సలిల్ పై చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ నందన్ నీలేకని, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ను ఉద్దేశించి లేఖ రాయడం జరిగింది. తాను ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగినని చెప్పుకున్న అతను, తన పేరును బహిర్గతం చేస్తే, ప్రతీకారం తీర్చుకుంటారన్న భయం ఉందని తెలిపాడు ఆ లేఖలో. సలిల్ పరేఖ్, కంపెనీలో చేరి 8 నెలలు గడుస్తున్నా, బెంగళూరుకు నివాసాన్ని మార్చలేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని అతనిపై ఆరోపణలు చేసాడు. సంస్థ విలువను, వ్యవస్థలను క్షీణింపజేసేలా ఆయన చర్యలు ఉన్నందునే, కొన్ని వాస్తవాలను బోర్డు దృష్టికి తేవడాన్ని తన కర్తవ్యంగా అనుకున్నాను అని తెలియచేసాడు.


కేవలం తన వ్యాపార ప్రయోజనాలు మాత్రమే సలిల్ పరేఖ్ కు ముఖ్యమని, అందుకే ఆయన ముంబైలోనే మకాం వేసున్నారని తెలుపుతూ, ఆయనకు స్టాక్ మార్కెట్ సంబంధాలున్నాయని, ఎన్నో కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు చేశాడు.ఇక అతని  చూసి చాలా మంది సంస్థ ఉన్నత ఉద్యోగులు కార్యాలయానికి రావడం మానేశారని తన లేఖలో తెలియచేయడం జరిగింది. నెలకు రెండు సార్లు ఆఫీసుకు వచ్చి వెళ్లేందుకు ఫ్లయిట్ చార్జీలు, ఇతర రవాణా నిమిత్తం ఆయన రూ. 22 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు చేశాడు. కాగా, ఈ తాజా ఆరోపణలపై ఇన్ఫోసిస్ ఇంకా ఎటువంటి  స్పందన లేదు అని తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: