స్మార్ట్ ఫోన్ ​ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్​మీ కే30 స్మార్ట్​ఫోన్​ను మంగళవారం  చైనాలో విడుదల చేయనుంది షియోమీ సంస్థ. గతంలో ఈ ఫోన్​ గురించి వచ్చిన అంచనాలకు అనుగుణంగానే.. రెండు సెల్ఫీ కెమెరాలతో (డ్యూయల్ పంచ్​ హోల్ కెమెరా), డ్యూయల్ మోడ్​ 5జీ సపోర్ట్​తో అందుబాటులోకి రానున్నట్లు షియోమీ స్పష్టం చేసింది. ఈ రెండు ఫీచర్లతో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం.

 

ఇక ఫోన్  ప్రత్యేకతలు గురించి తెలుసుకుందామా మరి....

*  5జీ, 4జీ నెట్​వర్క్​ వేరియంట్లు
* ఎమ్​ఐయూఐ 11- అండ్రాయిడ్​ 10
* 512జీబీ స్టోరేజ్
* 12జీబీ ర్యామ్​
* 20 ఎంపీ ఫ్రంట్​ కెమెరా
* 3.5 ఎమ్​ఎమ్​ హెడ్​ఫోన్​ జాక్ 
* డ్యూయల్​ ఫ్రీక్వెన్సీ జీపీఎస్​ 
* మూడు రంగులు

 

ఇక డ్యూయల్ మోడ్​ 5జీ అంటే... ఏమిటో చూదామా.. 5జీ నెట్​వర్క్ అనేది చాలా దేశాల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే చైనా, అమెరికా, బ్రిటన్​, జపాన్​ వంటి దేశాలు 5జీని విసృతం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దేశాల్లో 5జీ కోసం 4జీ నెట్​వర్క్​ మౌలిక సదుపాయాల్లోనే మార్పులు చేశారు. దీన్ని 5జీ నాన్​ స్టాండ్​ అలోన్​ యాక్సెస్​ (5జీ ఎన్​ఎస్​ఏ) అని అంటారు. సాధారణ 5జీ నెట్​వర్క్​ను స్టాండ్ అలోన్ యాక్సెస్ (5జీఎస్​ఏ) అంటారు. ఈ నేపథ్యంలో రెండు రకాల నెట్​వర్క్​లను వాడేందుకు వీలుగా రెడ్​మీ కే30 మోడల్​ను షియోమీ ఆవిష్కరించనున్నట్లు తెలియయచేసారు.

 

భారత్​కు రెడ్​మీ కే30...?

ఈ ఫోన్​ భారత్​లో అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశముందని సమాచారం. అయితే భారత్​లో ఇప్పటి వరకు 5జీ నెట్​వర్క్​ దిశగా పెద్దగా అడుగులు పడటం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తొలినాళ్లలో రెడ్​మీ కే30 4జీ వేరియంట్​ను భారత్​లో విడుదల చేసే అవకాశమున్నట్లు పలు టెక్​ వార్తా సంస్థలు అంచనా వేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: