కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా.. అయితే ఈ వ్యాసం మీకోసమే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ మ్యూచువల్ పండ్స్‌లో ఎక్కువకాలం ఇన్వెస్ట్ చేసినట్లయితే.. అదిరిపోయే రాబడి పొందొచ్చని ఎకానమీ నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలం అంటే.. కనీసం 25 ఏళ్లు నుంచి 30 ఏళ్లు వరకు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలని సూచిస్తున్నారు. ఇలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం పొందొచ్చని పేర్కొంటున్నారు. 

 

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో 25 నుంచి 30 ఏళ్ల పాటు సిప్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే.. అప్పుడు 15 నుంచి 17 శాతం వార్షిక రాబడిని ఆశించొచ్చని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కార్తీక్ ఝవేరి తెలిపారు. రోజుకు రూ.500 ఆదా చేసి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చని పేర్కొన్నారు. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో 30 ఏళ్ల పాటు నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తూ వెలితే.. మెచ్యూరిటీ సమయాని కల్లా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు రూ.16.2 లక్షలు అవుతుంది. దీనిపై మీకు వచ్చే రాబడి రూ.2.38 కోట్లుగా ఉంటుంది. అంటే మీరు మెచ్యూరిటీ సమయంలో రూ.2.54 కోట్లు పొందొచ్చు. 

 

ఒక చిన్న ట్రిక్‌తో మీ మెచ్యూరిటీ మొత్తాన్ని భారీగా పెంచుకునే అవకాశం కూడా ఉంది. మీరు నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు మీ సిప్ మొత్తాన్ని ప్రతి ఏడాది 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెలితే.. అప్పుడు మెచ్యూరిటీ సమయంలో ఇంకా ఎక్కువ రాబడి పొందొచ్చు.  ప్రతి నెలా రూ.4,500 సిప్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాలని భావిస్తే.. అప్పుడు మీరు ప్రతి ఏడాది సిప్ మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటే వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటే.. అప్పుడు 30 ఏళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.88 లక్షలు. ఈ మొత్తంపై మీ రాబడి రూ.4.82 కోట్లు అవుతుంది. 

 

అంటే, మీరు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.5.71 కోట్లు పొందొచ్చు.మీరు 10 శాతం సిప్ టాపప్ ఆప్షన్ ఎంచుకోకపోతే 30 ఏళ్ల తర్వాత మీరు పొందే మొత్తం రూ.2.5 కోట్లు అవుతుంది. అదే మీరు సిప్ టాప్ అప్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు వచ్చే మొత్తం ఏకంగా రూ.5.7 కోట్లు అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏకంగా 124 శాతం ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: