ఈ మద్య దేశీయ స్టాక్మార్కెట్లు కాస్త లాభసాటిగానే నడుస్తున్నాయి. ఈ రోజు పాజిటివ్ గా మొదలైన మార్కెట్లలో సెన్సెక్స్ 133 పాయింట్ల లాభంతో 33, 493 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లుఎగిసి 10336 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా రియల్టీ షేర్లు బాగా లాభపడుతున్నాయి.
భారతి ఎయిర్టెల్, వెంకీస్ ఇండియా,టాటా స్టీల్ లాభపడుతుండగా టీసీఎస్, ఎల్ అండ్ టీ, జెట్ ఎయిర్వేస్, డీఎల్ఎఫ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మొత్తానికి అన్ని సెక్టార్లు పాజిటివ్గానే ఉన్నాయి.