శీయ స్టాక్మార్కట్లు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల డబుల్ సెంచరీ చేసిన సెన్సెక్స్ చివరలో కూడా అదే జోష్ను కంటిన్యూ చేసింది. పాకిస్థాన్ ఆర్మీ అధీనంలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ను విడుదల చేస్తామని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను కాస్త తగ్గించడమే కాకుండా స్టాక్ మార్కెట్కు కూడా అనుకూలంగా మారింది. గత మూడు రోజులుగా నష్టాల బాటలో నడిచిన షేర్ మార్కెట్ ప్రస్తుతం లాభాల బాటలో పడింది.
ఉదయం 200 పాయింట్ల లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్కు ఐటీ, బ్యాంకింగ్ రంగ కొనుగోళ్లు కలిసొచ్చాయి. మార్చి డెరివేటివ్ సిరీస్ తొలి రోజు ఇన్వెస్టర్లు కొనగోళ్లతో 36,000 పాయింట్ల మార్క్ను, నిఫ్టీ 10860 మార్క్కు ఎగువన ముగిసాయి. సెన్సెక్స్ 196 పాయింట్లు ఎగిసి 36063వద్ద , నిఫ్టీ 71పాయింట్లు లాభపడి 10863వద్ద స్థిరంగా ముగిశాయి.
తద్వారా మార్చి డెరివేటివ్ కౌంటర్కు శుభారంభాన్నిచ్చాయి. ఇక ఎన్ఎస్ఈలో జీ ఎంటర్టైన్మెంట్, హిందూస్థాన్ పెట్రోలియం, ఐసీఐసీఐ, ఐఓసీ, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడగా.. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో షేర్లు మాత్రం నష్టపోయాయి.