సాధారణంగా విమాన ప్రయాణాలు అంటే ఎంతో ఖరీదుతో కూడుకునేవని తెలిసిందే.  కొన్ని సార్లు ప్రైవేట్ విమాన సంస్థలు పోటీలు పడీ టిక్కెట్ ధరలు తగ్గిస్తుంటారు.  ఇటీవల భారత్  పాక్ మద్య జరిగిన గొడవలో సర్జికల్ స్ట్రైక్-2తో విమాన టికెట్స్ ధరలు అమాంతం పెరిగాయి.  ఆ సమయంలో మొత్తం విమాన సంస్థలే మూవిసే పరిస్థితి నెలకొంది. 


మొత్తానికి ఈ గొడవలు సర్థుమణిగాయి.. దాంతో సమ్మర్ సీజన్ రావడంతో మళ్లీ పోటీ పడుతూ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి విమాన సంస్థలు.  తాజాగా  హైదరాబాద్‌ కు చెందిన ట్రూజెట్‌ విమాన సంస్థ ‘గ్రేట్‌ టేక్‌ ఆఫ్‌ సేల్‌’ పేరుతో ఆఫర్‌ ను ప్రకటించింది. 


రూ.799 ప్రారంభ ధర (టాక్స్ ఎక్స్ ట్రా )తో లక్ష వరకు సీట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ టికెట్లను మార్చి 8వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు బుక్‌ చేసుకోవచ్చు. ఈ నెల 8వ తేదీ నుంచి అక్టోబరు 26వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: