నందమూరి తారక రామారావు అంటే సినిమాలకు పెద్ద దిక్కు అంటారు.అంతేకాదు రాజకీయ లను కూడా పరిచయం చేసింది కూడా ఆయనే..ఆయన వారసుడు గా అంతటి ఘనత సాధించిన బాలకృష్ణ..
నందమూరి బాలకృష్ణ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు ఐదు పదుల సంవత్సరాలు అవుతుంది .ఎన్నో పరాజయాలను బాలయ్య ఎదుర్కొన్నాడు... వరుసబెట్టి ఎన్నో సినిమాలు హిట్ అయిన ప్పటికీ తాను మాత్రం ఎంతో వినయంగా మెలిగేవాడు. సినీ పరిశ్రమలో ఇలాంటి మనస్తత్వం ఉన్న ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని చెప్పుకోవచ్చు. గతంలో తాను తమ సినిమాల్లో వేసిన వేషాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రెండు సినిమాలు అతడి గొప్ప నటనా చాతుర్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాయి. అవేంటంటే ఆదిత్య 369, భైరవ దీపం సినిమాలు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 

 

 

బాలయ్య నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అభిమానులు పెరుగుతూ వస్తున్నారు. ఆయన మంచి తనం గురించి వేరేలా చెప్పనక్కర్లేదు.వాటిలో1991వ సంవత్సరంలో సింగీతం శ్రీనివాస్దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమాలో నందమూరి బాలకృష్ణ, మాస్టర్ తరుణ్, సుత్తివేలు, మోహిని సిల్క్ స్మిత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అదే బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలు చేసి అంతవరకు తెలుగులో ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు చూడని సినిమాకథలు అద్భుతంగా నటించి అందరి చేత వావ్ అనిపించాడు.  1992 వ సంవత్సరంలో బి.గోపాల్ దర్శకత్వంలో రౌడీ ఇన్స్పెక్టర్ తెరకెక్కి బాలకృష్ణ కెరీర్లో మరో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 

 

 

 


ఏప్రిల్ 14, 1994వ సంవత్సరంలో సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ ద్వీపం చిత్రంలో నందమూరి బాలకృష్ణ రోజా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో విభిన్న పాత్రలలో బాలయ్య నటించిన తీరు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. సినీ విమర్శకులు సైతం బాలకృష్ణ ఎటువంటి పాత్రలోనైనా చేయగల గొప్ప నటుడు అని కథనాల మీద కథనాలు ఎన్నో ప్రచురించారు. ఇంక ఇటీవల వచ్చిన రూలర్ ,లెజెండ్ సినిమాలు కూడా నందమూరి ఫ్యాన్స్  ఆకట్టుకున్నాయి..ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలయ్యకు మా ఏపి హెరాల్డ్ తరపున పుట్టిన రోజు శుభాకంక్షలు తెలియజేస్తున్నాము..

మరింత సమాచారం తెలుసుకోండి: