కట్టుకున్న భార్య భర్త ఉన్నాడు అనే సంగతి కూడా పూర్తిగా పెరిగింది.. అయితే భర్త ఉందాగానే ,పిల్లలు సరదాలు కూడా తీరాక పోయిన భర్త ను లెక్క చేయకుండా భర్త జైల్లో ఉండగా ప్రియుడితో కలిసి రాసలీలలు సాగించింది..ఆడవాళ్ళు కోరికలు ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంతణా అని అందరూ షాక్ అయ్యారు...మహిళలు కూడా చాలా విషయాల్లో మోసగాళ్లు అనే నిరూపించారు..
అసలు విషయానికొస్తే.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కిరాతకంగా చంపేశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా చేతిని నరికి తన భార్యకు ఇచ్చాడు. మరెవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇదే శాస్తి జరుగుతుందని హెచ్చరించాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని పుదుప్పేట్టై కృష్ణన్ ఆలయ వీధికి చెందిన బాలసుబ్రహ్మణి అలియాస్ రాజీబాయ్ ఓ ప్రైవేటు సంస్థలో పని చేసేవాడు. ఈ నెల 3న తిరువణ్ణామలై రోడ్డు వద్ద ఉన్న శ్మశానంలో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మరో ప్రాంతంలో అతడి చేయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానంతో రాణిపేటకు లారీడ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. కృష్ణగిరికి చెందిన ఆ వ్యక్తి లారీడ్రైవర్గా పనిచేస్తూ కొన్నాళ్ల క్రితం భారతీనగర్కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ కేసులో అతడు అరెస్టయి జైలుకు వెళ్లడంతో అతడి భార్య ఒంటరైంది. ఈ క్రమంలోనే బాలసుబ్రహ్మణి అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. వారు తరుచూ శారీరకంగా కలుస్తుండటంతో ఆమె గర్భం దాల్చింది.
అంతేకాదు గర్భం తొలగించుకోవాలని భర్త డిమాండ్ చేశారు..అతనితో అన్నీ మర్చిపోవాలని వార్నింగ్ ఇచ్చాడు.అతడు కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 3వ తేదీన అతడిని మద్యం తాగుదామని పిలిచి దారుణంగా చంపేశాడు. అనంతరం అతడి చేయిని నరికి ఇంటికి తీసుకెళ్లి భార్యకు ఇచ్చాడు. ఇకపై ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే వారిని వారికి కూడా ఇలాగే జరుగుతుందని హెచ్చరించాడు. సోమవారం అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి..అక్కడి నుంచి జైలుకు పంపించారు..