ఈ మధ్య కాలంలో మగాళ్లు ఎలా మారుతున్నారంటే అలా మారుతున్నారు. భార్య ఉండ గానే ప్రియురాలి ని మైంటైన్ చేస్తున్నారు. భార్య ను నానా హింసలు పెడుతూ వస్తున్నారు. ప్రియురాలి తోనే ఉంటున్న భర్త ఇంటి కి రావడం లేదని కోపం తో రగిలి పోయిన భార్య దారుణాని కి ఒడిగట్టింది. తన మొగుడిని ఎలా గైనా తన దగ్గరకు తెప్పించు కోవాలని భారీ ప్లాన్ వేసింది. అయితే ఆమె వేసిన మొదటి ప్లాన్ అట్టర్ ప్లాప్ అవ్వడంతో నిరాశకు గురైంది. అంతే కాదు తన భర్త దూర మవ్వడానికి కారణమై న దాని కి తగిన బుద్ది చెప్పాల ని నిర్ణయించుకుంది.. 

 

 


విషయాని కొస్తే.. తన భర్తను తనకు కాకుండా చేస్తోందన్న కోపం తో సవతిని దారుణం గా చంపేసింది. తుపాకీ తెచ్చి కాల్చిపారేసింది. ఈ దారుణ ఘటన యూపీ లోని మొరాదాబాద్‌ లో వెలుగు చూసింది. నగరాని కి చెందిన షబానా భర్త తో కలసి నివాసం ఉంటోంది. మరో మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త.. ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. కొద్దికాలంగా అసలు ఇంటి ముఖమే చూడలేదు. ప్రియురాలి మోజులో తనను పట్టించుకోవడం లేదని భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. తన భర్తను తనకు కాకుండా చేస్తున్న సవతిని చంపేయాలని నిర్ణయించుకుంది.

 

 


చాలా ఓపిక పట్టింది. భర్త ఎప్పటికైనా ఇంటికి వస్తాడని ఎదురు చూసింది కానీ భర్త ఇంతకీ రాకపోవడంతో ప్రియురాలి ఇంటికి వెళ్లి తుపాఖీతో దారుణంగా కాల్చి పడేసింది.. తీవ్రగాయాలతో పడి ఉన్న ప్రియురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మొరాదాబాద్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: