కరోనా ప్రభావం ఒకవైపు మనుషులను భయంతో చంపేస్తుంటే మరో వైపు బడాబాబులు మాత్రం డబ్బులు సంపాదించే అసాంఘిక కార్యకలాపాలను జోరుగా సాగిస్తున్నారు.హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీలలో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారు. అయితే ఇళ్ల మధ్యలో ఉంటూ వ్యభిచారం సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. స్పాట్ లో దొరికిన నలుగురు కాల్ గర్ల్స్ ను , వారికోసం వచ్చిన ఎనిమిది మంది విటులను పోలీసులు అరెస్ట్ చేసారు.
వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని భాగల్ పూర్ గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహం పై పోలీసులు మెరుపుదాడి చేసి భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. నలుగురు కాల్ గర్ల్స్ సహా ఎనిమిది మందిని అదుపు లోకి తీసుకున్నారు. రెసిడెన్షియల్ కాలనీ లో గుట్టుగా సాగిపోతున్న. జొగాసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఆదంపూర్చౌక్ ఏరియా లోని నివాస గృహాల మధ్య వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పశ్చిమ బెంగాల్కి చెందిన ముగ్గురు, జంషెడ్పూర్కి చెందిన కాల్ గర్ల్స్ నలుగురిని అదుపు లోకి తీసుకున్నారు. వారితో పాటు ఉన్న విటుడి తో సహా మరో ముగ్గురు నిర్వాహకుల ను అరెస్టు చేశారు.
ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసుల కు ఘటన స్థలం లో భారీ సంఖ్య లో గదిలో భారీగా కండోమ్ ప్యాకెట్లు, మగ వారిలో కామోద్రేకం పెంచేందుకు వినియోగించే ట్యాబ్లెట్లు లభ్యమయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంగర్, హుగ్లీ నుంచి వచ్చిన మూడు కుటుంబాలు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా అక్కడ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని అతని భార్య ను అదుపు లోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.