అక్రమ సంబంధం అనేది పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటిలో ఆడవాళ్లు ముదుర్లుగా మారారు. వావి వరుసలు మరచి మసలుతున్నారు. అంతేకాకుండా వయసును కూడా పక్కన పెట్టేసి తమకన్నా చిన్న వారితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. భర్తకు దూరంగా ఉంటున్న మహిళ తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడితో లైంగిక సంబంధం కొనసాగిస్తోంది. అయితే తన ప్రియురాలు మరికొందరితోనూ సంబంధం పెట్టుకుందని అనుమానించిన యువకుడు ఆమెను కిరాతకంగా పొడిచి చంపేశాడు.

 

 

వివరాల్లోకి  వెళితే.. ఈ దారుణ ఘటన చెన్నై లోని సమీపంలోని తాంబరం వండలూరు విఘ్నేశ్వర నగర్ లో వెలుగు చూసింది. స్థానికంగా గోపి, యశోద రాణి అనే దంపతులు కాపురముండేవారు. వారికి ఇద్దరు సనాతనం కూడా ఉన్నారు. యశోద కుటుంబ పోషణలో  భర్తకు సాయం చేయాలనుకొని టైలరింగ్ చేస్తూ ఉండేది. ఆమె పనితనం బాగుండటంతో గిరాకీ బాగా వచ్చేది.

 

 

 

ఆ క్రమంలో షాప్‌కు వచ్చే మగవారితో యశోద చనువుగా మాట్లాడుతుండటాన్ని చూసిన గోపి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దంపతుల మధ్య గొడవలు పెరగడంతో యశోద పిల్లలను తీసుకుని వేరుగా జీవిస్తోంది. ఈ క్రమంలోనే తాంబరంలోని మోతీలాల్ నగర్ వెటై కన్నాపూర్ ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు.

 

 

 

భర్తకు  దూరంగా ఉందని తెలుసుకున్న యువకుడు ఆమెకు ఇంకా దగ్గరయ్యాడు. క్రమంగా ఇద్దరి మధ్య అక్రమ సంబధం ఏర్పడింది. భర్త అడ్డు లేకపోవడంతో యశోద ప్రియుడితో విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని అతడు ఆమె నుంచి భారీగా డబ్బులు తీసుకునేవాడు. కొద్దిరోజులుగా ఆమెకు పనిభారం ఎక్కువ కావడంతో ప్రియుడిని కలవడం తగ్గించింది. దీంతో ఆమె వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతోందని అనుమానించాడు.దాంతో కోపోద్రుడైన యువకుడు ఆమెను అతి దారుణంగా చంపేశాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: