క్రైమ్ రేటు భారత దేశంలో బాగా పెరిగి పోతుంది ఎక్కడ చూసినా కూనీలు, అత్యాచారాలు.. ఒకప్పుడు మగవాళ్ళు చేసేది ఈ మధ్య తక్కువ అయిందట.. ఆడవాళ్ళ చేసే క్రైమ్ లు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.. అంతే కాదండోయ్ అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను చంపిన భార్యలు కూడా చాలా మందే ఉన్నారు.. క్షణ కాల సుఖం కోసం కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపేస్తున్నారు. అందుకే ఇప్పుడు అన్నిట్లో ఎక్కువ మహిళల పేరే వినపడుతుంది.. మొత్తానికి మహిళలే ముందంజ అనే మాట రుజువైంద న్నమాట.

 

 

 

ఇక పోతే భార్య భర్తల మధ్య కీచు లాటలు రోజు రోజుకు పెరుగుతున్నాయని భర్తను కడ తేర్చిన ఘటన ఆలస్యంగా వచ్చింది.. తాగొచ్చి అయిందానికి కానీ దానికి కొడుతుండేవాడు.. ఇద్దరి మద్య గొడవలు జరుగుతుండడం కూడా అందుకు బలాన్ని చేకూర్చింది. దాంతో విసిగి పోయిన భార్య భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మజ్జిగ లో విషం కలిపి భర్తకు ఇచ్చింది. దాంతో అతను కూర్చున్న చోటే కన్నుమూశారు. చూడటానికి  ఆ హత్య మిస్టరీ మారింది.  

 

 


వివరాల్లోకి వెళితే..ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలేనికి చెందిన ఏడుకొండలరెడ్డి హఠాత్తుగా మరణించాడు. సడెన్‌గా భర్త చనిపోవడంతో భార్యపై అనుమానాలు రేగాయి. ఇద్దరి మధ్య కొద్ది నెలల నుంచి గొడవలు జరుగుతుండడంతో భార్యే ఘాతుకానికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. మజ్జిగలో విషం కలిపి ఇచ్చిందని.. అవి తాగి ఏడుకొండలరెడ్డి మరణించాడని బంధువులు ఆరోపించడంతో మరణం మిస్టరీగా మారింది... చూడటానికి  ఆ హత్య మిస్టరీ మారింది.  అది హత్యా? లేక సాధారణ మరణమా? అనేది పోలీసులకు పెద్ద తల నొప్పిగా మారింది. మరి పోలీసుల దర్యాప్తు పూర్తి అయితే కానీ అసలు విషయం తెలియదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: