అక్రమ సంబంధాలు కోసం కొందరు ఆడవాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు.. అది ఒకప్పటి మాట ఇప్పుడు మాత్రం ప్రియుడితో శారీరక సుఖానికి అడ్డువస్తే కుటుంబాన్ని మొత్తాన్ని కాటికి పంపించడానికి రెడీ అవుతున్నారు.. కట్టుకున్న భర్త వుండగానే మరో మగాడి మోజులో పడి దారుణాలకు పాల్పడుతున్నారు.. అక్రమ సంబంధాల కు బానిసలై పచ్చటి సంసారాలు చేతులారా తుంచేస్తున్నారు.. ఇక్కడ ఓ మహిళ ప్రియుడితో రాసలీలలు చేయడానికి కట్టుకున్న భర్త పిల్లలు అడ్డువస్తున్నారని విషమిచ్చి చంపేసింది..

 

 

 

వివరాల్లోకి వెళితే..  విషాద సంఘటన హర్యానాలో వెలుగుచూసింది. కురుక్షేత్ర పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత(45)కి అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచూ కలుసుకుని రహస్యంగా రాసలీలలు సాగించేవారు. అది భర్తకి, కూతురికి తెలిసిపోవడంతో గొడవలు మొదలయ్యాయి.ఇటీవల కూడా అతను ఇంటికి వచ్చి వెళ్లిన సంగతి భర్తకు తెలియడంతో పద్దతి మార్చుకోవాలని గట్టిగా హెచ్చరించారు..

 

 

 


కూతురు కూడా తండ్రికి సపోర్ట్ చేస్తూ మాట్లాడటంతో సహించలేక పోయింది.కూతురు భర్తపై అమితమైన కోపం పెంచుకున్న భార్య ఆ ఇద్దరి అడ్డు తొలగించుకుంటే తన ప్రియుడితో కలిసి ఉండవచ్చునని భావించి ప్లాన్ వేసింది..రాత్రి భోజనంలో విషం పెట్టి చంపేసింది. అనంతరం తాను కూడా విషం తాగి ప్రాణాలు తీసుకుంది.సమీపంలో నివాసం ఉంటున్న మామ ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలతో సహా వారి కూతురు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే తన చిన్నకొడుకు, బంధువులకు ఫోన్ చేసి ముగ్గురినీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురూ ప్రాణాలు విడిచారు. తన కోడలికి మరొకరితో శారీరక సంబంధం ఉందని.. ఆ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుతున్నాయని పోలీసులకు తెలిపారు..అందుకే పరాయి మగాడి తో అన్నా చెల్లిల సంబంధం కొనసాగించాలని పెద్దలు చెబుతుంటారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: