మాములుగా భార్య భర్తల మధ్య ఏదైనా గోడవలొస్తే భర్తలు భార్యలను చంపిన వార్తలు చూస్తాం. కానీ ఒక్కోసారి భార్యలే భర్త వేధింపులు భరించలేక భర్తను చంపిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి ఘటనే తమిళనాడు లో జరిగింది. తన కోరికలకు భర్త అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చేసింది. తన ప్రియుడుతో కలిసి భర్తను తుపాకీ తో కాల్చి చంపింది.  తిరుపత్తూరు జిల్లా నాట్రాంపల్లి సమీపంలోని పోతకుట్ట అనే గ్రామంలో జరిగింది.

 


పోతకుట్ట గ్రామానికి చెందిన గోవిందరాజ్‌ (53) అనే వ్యక్తి దర్జీగా పని చేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీ జయంతిపురంలో స్పృహ కోల్పోయి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతన్ని ఆంబులెన్స్‌ లో సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. గోవిందరాజ్ భార్య కాంచన, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్టు తేలిందని పోలీసులు తెలిపారు. కాంచన (40) కు అదే ప్రాంతానికి చెందిన కుప్పుస్వామి(22)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

 


ఈ విషయం తెలుసుకున్న గోవిందరాజ్‌ భార్యను మందలించాడు. అందుకే  ఆమె భర్తను హత మార్చేందుకు పథకం వేసిందని పోలీసులు తెలిపారు. కుప్పుస్వామి, ఆయన మిత్రులు ముగ్గురు కడంబూర్‌కు వెళ్లి నడికరువర్‌కు చెందిన ముత్తయ్య అనే వ్యక్తికి రూ.లక్ష అందజేసి నాటు తుపాకీ కొనుగోలు చేశారు. గత 4వ తేదీ రాత్రి 10 గంటలకు జయచంద్రపురంలో నడచి వెళుతున్న గోవిందరాజ్‌ ను కుప్పుస్వామి తుపాకీ తో కాల్చగా తీవ్రంగా గాయపడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో కాంచన, కుప్పుస్వామి, ముత్తయ్య సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తామే నేరం చేశామని అంగీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: