ప్రపంచంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన జర్నీ క్రూయిజ్ షిప్ ప్రయాణం. మరి, అంత డబ్బులు పోసి అందులో ప్రయాణిస్తున్నప్పుడు కొత్త అనుభూతలు కూడా పొందకపోతే ఎలా అనుకున్నారో ఏమో ఆ జంట కొత్త సాహసం చేసారు ఆ ఇద్దరు.తమకు కేటాయించిన కేబిన్ (గది) తలుపులు తెరిచి మరీ రతిక్రీడలో మునిగిపోయారు. తోటి పర్యాటకులకు ఇబ్బంది కలిగించారు.


నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఆ పని వాళ్లు తలుపులు తెరిచి, గట్టిగా కేకలు పెడుతూ చేయడం వల్ల పర్యాటకులు ఆ క్రూయిజ్ షిప్ యజమానులకు ఫిర్యాదు చేయక తప్పలేదు. దీంతో షిప్ సిబ్బంది వారిని కట్టుబట్టలతో షిప్ నుంచి దింపేసి దీవిలో వదిలేశారు. ఈ సంఘటన కరేబీయన్ దీవుల్లో చోటుచేసుకుంది.


జర్మనీకి చెందిన రెనాటే ఎఫ్, ఆమె భర్త వాల్కర్‌ ‘మీన్ స్కిఫ్ 5’ క్రూయిజ్ షిప్‌లో బార్బడాస్‌కు బయల్దేరారు. సరికొత్త అనుభూతి కోసం వారు తమ కేబిన్‌లోనే బాల్కనీ తలుపులు తెరిచి శృంగారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గట్టిగా కేకలు పెట్టడంతో షిప్‌లో ఉన్న మిగతా పర్యాటకులకు వినిపించింది. అయితే, వారి అరుపులు అలాగే కొనసాగడంతో షిప్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.


దీంతో పర్యాటకులు ఆ జంటను బలవంతంగా దీవిలోకి దింపేశారు. ఈ సందర్భంగా ఆ జంట మాట్లాడుతూ.. ‘‘కనీసం మా లగేజ్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని షిప్ నుంచి కిందకి గెంటేశారు.షిప్ యాజమాన్యంపై మేము కోర్టులో దావా వేస్తాం. బాల్కానీ తలుపులు తెరిస్తే పక్కవారికి ఇబ్బంది కలుగుతుందని మేం ఊహించలేక పోయాము. వారు కట్టుబట్టలతో కింద వదిలి పెట్టకుండా హెచ్చరించి ఉంటే సరిపోయేది అనిపించింది. ఇప్పుడు మేము అనుభవిస్తున్న మానసిక వేదనకు షిప్ యాజమాన్యం భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది’’ అని ఆ జంట తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: