ఇటీవల కాలం లో  మహిళలపై జరుగుతున్నఅగయిత్యాలు , అత్యాచారాల  పైన పెద్ద ఎత్తున చర్చసాగుతుంది .మహిళలు తమను తాము ఎలా  రక్షించుకోవాలో అనే  విషయంలో వారిని ఎడ్యూకేట్‌ చేసేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. అయితే ఇంకా  కొంత మంది మాత్రం జరుగుతున్న హత్య చారలు  మహిళల స్వయం కృత అప్రదం అంటూ  నోరు పారేసుకుంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిలో కొంతమంది సెలబ్రిటీలు కూడా ఉండటం ఎంతో బాధ కలిగించే   విషయం .

 

సీనియర్ నటుడు, దర్శకుడు కే భాగ్యరాజ ఓ సినీ వేడుకలో మాట్లాడుతూ ఆడవారి గురించి  దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. మహిళలు కట్టుబాట్లు వదిలేస్తున్నారని  ఆలా కట్టుబాట్లను గాలి కి వదిలేయడం వల్లనే ఇలాంటి అనర్దాలు  జరుగుతున్నాయి అంటూ మహిళలపై ఆయన మండి పడ్డారు. స్త్రీలపై వేదింపులు, అత్యాచారాలు కేవలం వారి అజాగ్రత్త వల్ల మాత్రమే జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం మహిళలు ఎక్కువగా సెల్‌ఫోన్‌తోనే సమయం గడుపుతున్నారు. ఒక్కొక్కరు రెండు ఫోన్లు, రెండు సిమ్‌లు వాడుతున్నారు. వారిపై అఘాయిత్యాలకు ఇది ఒక  కారణమే అన్నారు.

 

మహిళలు కట్టుబాట్లలో ఉన్నప్పుడు ఇలాంటి దారుణాలు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇటీవల సంచలనం సృష్టించిన పొల్లాచ్చి సంఘటనను ప్రస్తావించిన భాగ్యరాజ, వింత లాజిక్‌ను తెర మీదకు తెచ్చాడు. ఈ విషయంలో కేవలం అబ్బాయిలను మాత్రమే తప్పు పట్టడం కరెక్ట్ కాదన్నాడు. అమ్మాయిలు చేసిన పోరపాట్లను మాత్రమే అబ్బాయిలు ఉపయోగించుకుంటున్నారని,  అంటూ అమ్మాయి జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు జరగవు ..

 

పొల్లాచ్చి లో జరిగిన  సంఘటన లోనూ అమ్మాయిదే తప్పన్నట్టుగా మాట్లాడాడు.మగవాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకోవడాన్ని కూడా ఆయన సమర్థిస్తు తప్పు లేదు  అన్నట్లుగా  మాట్లాడాడు. మగవాడు తప్పు చేస్తే, తరువాత కరెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఆడవాళ్లు తప్పు చేస్తే కరెక్ట్ అంటూ వింతగా మాట్లాడాడు . అలాగే ఒక మగవాడికి రెండో భార్య ఉంటే మొదటి భార్యకు  ఏ ఇబ్బందికలగడం లేదు . కానీ ఒక మహిళకు అక్రమ సంబంధం ఉంటే మొదటి భర్తను చంపేస్తున్నారు అంటూ ఇష్టం వచ్చినట్టుగా వాగాడు.

 

అంతేకాదు మహిళలు  వాళ్ళ పరిమితుల్లో ఉంటేనే వాళ్ళకి  మంచిది అంటూ దారుణంగా మాట్లాడాడు.భాగ్యరాజ చేసిన వ్యాఖ్యలపై మహిళ సంఘాలు ఫైర్‌ అవుతున్నాయి. ఆయన, వెంటనే మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు భాగ్యరాజపై కేసులు వేసేందుకు కూడా మహిళాసంఘాలు  సిద్దమవుతున్నారు. ఇప్పటికే మీటూ ఆరోపణలతో తమిళ ఇండస్ట్రీ పరువు పోయిందని బాధపడుతున్న తరుణంలో భాగ్యరాజ చేసి ఈ వ్యాఖ్యలు మరింతరెచ్చగొట్టే విదంగా ఉన్నాయ్ .

మరింత సమాచారం తెలుసుకోండి: