హైదరాబాద్‌లో దిశ హత్యాచారం  ఘటన మరువకముందే మరో దారుణ సంఘటన  ఈ సంఘటనలు జరిగిన కొన్ని రోజులు బీనీరసాన్లు జరుగుతాయి టాప్ రేపిస్ట్ లపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు ఆలా చర్యలు తీసుకోకపోవడం వల్లే మరో మహిళా బాలి అయింది మన న్యాయవ్యవస్థ కె సిగ్గు చేటు యినా సంఘటన  మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఒక మృగం17 సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసాడు  దానికికి గాను కేవలం జైలు శిక్ష మాత్రమే పడింది  జైలు కెళ్లిన యువకుడు రెండు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు.

 

అనంతరం  ఆ బాలిక ఇంట్లోకి చొరబడి 30 కత్తిపోట్లు పొడిచి దారుణంగా  చంపేశాడు ..పోలీసుల వివరాల  ప్రకారం జబల్‌పూర్‌లో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.  రెండు నెలల క్రితం బాధిత బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా అరెస్టు చేసి పోకో చట్టం కింద నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే  10 రోజుల క్రిందట  బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు బాధితురాలిపై పగపెంచుకున్నాడు.

 

ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా జైలు నుంచి వచ్చిన నాటి నుంచి ఆ బాలిక ఇంటిపై కన్నేసి ఉంచాడు. సోమవారం ఆమె తల్లిదండ్రులుఇంట్లో లేని సమయం చుసిన   హంతకుడు వెంటనే ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం బాధితురాలిఫై కత్తితో దడి కి దిగాడు  కత్తితో 30 పోట్లు పొడిచాడు.  ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేయడాన్ని బయట ఆడుకుంటున్న ఆమె తమ్ముడు విన్నాడు. వెంటనే పక్కింటి వారికి ఈ విషయం చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు.

 

ఆ బాలిక ఆర్తనాదాలు విన్న స్థానికులు ఇంట్లోకి చొరబడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె శరీరంపై దాదాపు 30 కత్తిపోట్లు ఉన్నాయని, అధిక రక్తస్రావం కారణంగా ఆమె చనిపోయింది అని  వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: