వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. ఇటీవల ఆంధ్రా మీడియాకు మంచి మసాలా ఐటమ్ గా మారారు. జగన్ వంటి బలమైన లీడర్ ఉన్న పార్టీలో నాయకుడికి వ్యతిరేకంగా గళం విప్పాలంటే చాలా గట్స్ ఉండాలి. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు మాత్రం తాను జగన్ వెంట ఉంటానంటూనే జగన్ పరిపాలనపై కొన్ని రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

 

 

మొదట్లో చిన్నా చితకా డైలాగులు పేల్చిన రఘురామకృష్ణంరాజు.. ఇక ఇప్పుడు భారీ డైలాగులు మొదలుపెట్టారు. బతిమిలాడితేనే పార్టీలోకి వచ్చాను.. నా వల్లే ఎమ్మెల్యేలు గెలిచారు. దమ్ముంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి.. అందరం పోటీ చేద్దాం.. అనే రేంజ్‌కు వెళ్లారు. దీనిపై మంగళవారం టీవీ9 డిబేట్ నిర్వహించింది. ప్రముఖ జర్నలిస్టు రజనికాంత్ నిర్వహించిన ఈ డిబేట్‌లో రఘురామకృష్ణంరాజుతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

 

ఈ డిబేట్ ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో రఘురామకృష్ణం రాజు ఒక్కసారిగా తనఫోకస్ ను టీవీ9 యాంకర్లపై పెట్టేశారు. అసలు మా మధ్య ఏ గొడవాలేదు.. అంతా మీరే ఫిట్టింగ్ పెట్టారంటూ టీవీ9 పై విరుచుకుపడ్డారు. మొన్న ఎన్‌కౌంటర్ ప్రోగ్రామ్‌కు వస్తే.. మీ యాంకర్ మురళీ కృష్ణ ఏదో అడిగాడు.. నేను చెప్పిన సమాధానంలో కొన్ని ముక్కలు కట్ చేసి మీకు అనుకూలంగా టెలికాస్ట్ చేశారు. దీంతో ఈ గొడవ అంతా వచ్చిందని రఘురామకృష్ణంరాజు చెప్పడంతో రజినీకాంత్ మొదట షాక్ అయ్యారు.

 

 

ఆ తర్వాత తేరుకుని.. అలాంటిదేమీ లేదు.. మొత్తం టెలికాస్ట్ చేశాం.. అయినా మీరూ మీరూ కొట్టుకుని చివరకు మామీదకు రావడం సహజమే.. అంటూ తెలివిగా కవర్ చేసేశారు. ఇదే సమయంలో మీడియా ఇలా పుల్లలు పెట్టకూడదని వీలైతే కలపాలని చూడాలి కానీ.. ఇలా పిలిచి మాకు మాకు గొడవలు పెట్టకూడదని రఘురామకృష్ణంరాజు టీవీ9కు హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: