ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థలోని సుమారు 20 ఐసీడిఎస్ ప్రాజక్టులలో ఖాళీగా ఉన్న 489 అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో వివాహితులు అయిన మహిళలలు అర్హులుగా పేర్కొంది.అర్హులు అయిన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులని ఆహ్వానిస్తోంది. ఇందులో అంగన్వాడీ , మినీ అంగన్వాడీ, అంగన్వాడీ సహాయకులు లాంటి పోస్తులని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..
పోస్టుల వివరాలు :
అంగన్వాడీ : 63
మినీ అంగన్వాడీ : 83
అంగన్వాడీ సహాయకులు : 343
మొత్తం పోస్టుల సంఖ్య : 489
అర్హతలు : 10th పాస్ అయ్యి ఉండాలి, అదేవిధంగా స్థానిక గ్రామములో వారు అయ్యి ఉండాలి.
వయసు : 01-07-2019 నాటికి 21-35 ఏళ్ళ మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 30
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
చివరి తేదీ : నవంబర్ -30 -2019
మరిన్ని వివరాలకి : https://chittoor.ap.gov.in