ఇటీవల తెలంగాణలో పాఠశాల విద్యకు సంబంధించి తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో 'సమగ్ర శిక్ష అభియాన్'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే కదా. సంబంధిత అర్హత అభ్యర్థుల నుంచి నవంబరు 20 నుంచి 26 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. తాజాగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించనున్న పరీక్షల షెడ్యూలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది. ఇక విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 23, 24 తేదీల్లో ఆన్లైన్ విధానంలో నియామక పరీక్షలు నిర్వహించ బోతున్నారు అని తెలియచేయడం జరిగింది.
అసలు పరీక్ష ఎప్పుడు అన్న విషయాన్ని వస్తే డిసెంబరు 23న మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎంఐఎస్) కోఆర్డినేటర్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ) పోస్టులకు పరీక్ష నిర్వహించ బోతున్నారు అని షెడ్యూల్ తెలిపింది. అదే విధంగా రాత పరీక్షా ద్వారా డిసెంబరు 24న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అసిస్టెంట్ ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులకు కూడా నిర్వహించ బోతున్నారు.
ఇక ముఖ్యమైన పరీక్ష సమయం విషయానికి వస్తే. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష ఉండబోతుంది. మొదటి రోజు రెండు సెషన్లలో, రెండో రోజు ఒకే సెషన్లో పరీక్షలు ఉంటాయి అని తెలియచేయడం జరిగింది.
ఇక పరీక్ష కేంద్రాల విషయానికి వస్తే....ఆన్లైన్ విధానంలో నిర్వహించే పరీక్షల కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక పోస్టుల వివరాలు ఇలా..మొత్తం ఖాళీలు: 704
ఎంఐఎస్ కోఆర్డినేటర్ - 144
సిస్టమ్ అనలిస్ట్ - 12
అసిస్టెంట్ ప్రోగ్రామర్ - 27
డేటా ఎంట్రీ ఆపరేటర్ - 138
ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ - 383
రాతపరీక్ష విధానం మాత్రం మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పరీక్షలో రెండు విభాగాలు (పార్ట్-1, పార్ట్-2) గా ఉంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కులు కేటాయించడాం జరిగింది. ఇంకా ఎందుకు ఆలస్యం పరీక్షకు అప్లై చేసుకున్నవారు మంచిగా ప్రిపేర్ అయ్యి పరీక్షకు సిద్ధం అవ్వండి.